తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ చేతులమీదుగా రేపు కర్తార్​పుర్ ప్రారంభం - PM to inaugurate Kartarpur corridor checkpost

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు కర్తార్​పుర్ నడవాను ప్రారంభించనున్నారు. ముందుగా బేర్​ సాహిబ్​ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థన చేసిన అనంతరం.. ప్రయాణికుల టెర్మినల్​ భవనాన్ని ప్రారంభిస్తారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు.

మోదీ చేతులమీదుగా రేపు కర్తార్​పుర్ ప్రారంభం

By

Published : Nov 8, 2019, 7:28 PM IST

కర్తార్​పుర్ ఆధ్యాత్మిక నడవా రేపు ప్రారంభం కానుంది. భారత్​లోని డేరాబాబా నానక్ గురుద్వారా ను పాకిస్థాన్​ పంజాబ్​లోని దర్బార్ ​సాహిబ్​ పుణ్యక్షేత్రాన్ని కలుపుతూ నిర్మాణమైన ఈ నడవాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. పంజాబ్​ డేరా బాబా నానక్​ వద్ద ఆర్ట్​ పాసింజర్​ టెర్మినల్​ భవనాన్ని (పీటీబీ) మోదీ ప్రారంభిస్తారు.

ప్రారంభోత్సవానికి ముందు సుల్తాన్​పుర్​ లోధిలోని బేర్​ సాహిబ్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ప్రధాని. ప్రారంభోత్సవం అనంతరం డేరా బాబా నానక్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు.

2018 నవంబర్​ 22న గురు నానక్ 550వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం.. తీర్మానాన్ని ఆమోదించింది. అదే సమయంలో కర్తార్​పుర్ నడవా నిర్మాణానికి తుది నిర్ణయం తీసుకుంది.

అత్యాధునిక భవనం..

15 ఎకరాల భూమిలో పర్యటకుల కోసం అత్యాధునిక టెర్మినల్​ భవనాన్ని నిర్మించారు. విమానాశ్రయానికి సమానమైన ఏసీ భవనంలో 5 వేలమంది యాత్రికులకు సరిపోయే విధంగా 50 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లను ఏర్పాటుచేశారు.

ఇదీ చూడండి: గాంధీలకు ఎస్పీజీ భద్రత కట్​.. ఇక నుంచి జెడ్​ ప్లస్​లోనే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details