తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్లాస్టిక్​ సీసా వద్దు... కూజానే ముద్దు: మోదీ

వీధి వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన 'పీఎం స్వనిధి' లబ్ధిదారులతో ప్రధాని నరేంద్రమోదీ సంభాషించారు. మధ్యప్రదేశ్​లోని ఇండోర్​, గ్వాలియర్, రాయ్​సెన్​ జిల్లాలకు చెందిన వీధి వ్యాపారులతో మాట్లాడిన మోదీ.. తాగు నీటి కోసం ప్లాస్టిక్​ సీసాలకు బదులుగా కూజాలను వినియోగించాలని సూచించారు.

By

Published : Sep 9, 2020, 1:30 PM IST

MP-MODI-STREET VENDORS
మోదీ

మధ్యప్రదేశ్​లోని 'పీఎం స్వనిధి' లబ్ధిదారులతో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం సంభాషించారు. దృశ్యమాధ్యమం ద్వారా వీధి వ్యాపారులతో మాట్లాడిన మోదీ.. వ్యాపారాభివృద్ధికి పలు సూచనలు చేశారు.

ఇండోర్​కు చెందిన వీధివ్యాపారులు ఛగన్​లాల్​, అతని భార్య సన్వీర్; గ్వాలియర్​ నుంచి అర్చన శర్మ; రాయ్​సెన్​ నుంచి కూరగాయల వ్యాపారి దాల్​చంద్​కు మోదీతో మాట్లాడే అవకాశం లభించింది. ఇందులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​ కూడా పాల్గొన్నారు.

వ్యాపారంతోపాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు మోదీ. ఇందులో భాగంగా తాగునీటి కోసం ప్లాస్టిక్ సీసాలకు బదులుగా కుండలు, కూజాలు వినియోగించాలని సూచించారు.

వ్యాపారాలపై ఆరా..

వీధి వ్యాపారుల కోసం తీసుకొచ్చిన స్వనిధిపై ఆరా తీశారు మోదీ. ఈ పథకం ద్వారా ఎలా లబ్ధిపొందారో అడిగారు. వాళ్ల వ్యాపారాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. ఛగన్​లాల్​ను ఉజ్వల పథకం ద్వారా ఎలా లబ్ధి పొందుతున్నారో తెలుసుకున్నారు. డిజిటల్​ పేమెంట్ల ద్వారా వ్యాపారం సాగిస్తున్న దాల్​చంద్​ను అభినందించారు మోదీ.

ఇదీ చూడండి:వీధి వ్యాపారులకు అండగా పీఎం స్వనిధి

ABOUT THE AUTHOR

...view details