తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్య రామాలయానికి మోదీ శంకుస్థాపన చేయాలి!' - baba ramdev says PM should lay foundation stone for Ram Mandir

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా శంకుస్థాపన జరగాలని ప్రముఖ యోగా గురువు బాబా రామ్​దేవ్​ ఆకాంక్షించారు. కర్ణాటకలోని ఉడిపిలో 5 రోజులపాటు నిర్వహిస్తున్న యోగా శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అయోధ్య రామాలయానికి మోదీ శంకుస్థాపన చేయాలి: బాబా రామ్​దేవ్​

By

Published : Nov 17, 2019, 4:57 AM IST

Updated : Nov 17, 2019, 7:56 AM IST

'అయోధ్య రామాలయానికి మోదీ శంకుస్థాపన చేయాలి!'

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ.. శ్రీరామ నవమి రోజున శంకుస్థాపన చేయాలని యోగా గురువు బాబా రామ్​దేవ్​ అభిప్రాయపడ్డారు. ఈ ఆలయం వేద సంప్రదాయానికి అద్దంపట్టేలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

"అయోధ్యలోని రామాలయం హిందువుల గొప్ప తీర్థయాత్ర స్థలంగా అభివృద్ధి చెందాలి. వాటికన్​ సిటీ, మక్కా, అమృత్​సర్​లోని స్వర్ణదేవాలయంలా మహోత్కృష్టంగా ఎదగాలి." -బాబా రామ్​దేవ్​, యోగా గురువు

కర్ణాటకలోని ఉడిపిలో 5 రోజుల పాటు నిర్వహిస్తున్న యోగా శిక్షణ శిబిరంలో పాల్గొన్న బాబా రామ్​దేవ్ ​ఈ వ్యాఖ్యలు చేశారు.

"అయోధ్య రామాలయం గొప్ప వేద సంప్రదాయాలను ప్రతిబింబించాలి. రామజన్మ భూమి ట్రస్టు ఆధ్వర్యంలో అయోధ్య ... ఆధ్యాత్మిక జ్ఞానబోధనకు కేంద్రంగా నిలవాలి."-బాబా రామ్​దేవ్, యోగా గురువు​

ఇదీ చూడండి:'పార్లమెంట్​ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలి'

Last Updated : Nov 17, 2019, 7:56 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details