తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఫొని'పై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష

దిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఫొని తుపానును ఎదుర్కోవడానికి చేపట్టిన సన్నాహక చర్యలు, తీసుకోవాల్సిన సహాయ, పునరావాస కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు మోదీ.

By

Published : May 2, 2019, 5:20 PM IST

Updated : May 2, 2019, 6:09 PM IST

'ఫొని'పై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష

'ఫొని'పై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష

ఫొని తుపానుపై గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

తుపాను పయనించే మార్గం, చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలను ప్రధాని మోదీకి అధికారులు వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్​ఎఫ్​, సైనిక దళాలను సహాయక చర్యల కోసం వినియోగించాలని నిర్ణయించారు.

తాగునీరు, విద్యుత్​, టెలికాం సేవలను పునరుద్ధరణకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మోదీ సూచించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు మోదీ నిర్దేశించారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేబినెట్​ సెక్రటరీ, ఇతర ముఖ్య అధికారులు, ఐఎండీ, ఎన్డీఆర్​ఎఫ్​, ఎన్​డీఎమ్​ఏ, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

ఫొని తుపాను రేపు ఒడిశాలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల్లోని సుమారు 8 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.

ఇదీ చూడండి: ఫొని టెర్రర్​: ఒడిశాలో 8లక్షల మంది తరలింపు

Last Updated : May 2, 2019, 6:09 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details