మహారాష్ట్ర గడ్చిరోలిలో పోలీసుల మృతికి కారణమైన వారిని వదలబోమని ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మావోయిస్టుల దాడిలో మృతి చెందిన 15మంది పోలీసులు, డ్రైవర్ ఆత్మకు శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటించారు. వారి త్యాగాలు వృథా కావని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
హోంమంత్రి సమీక్ష
గడ్చిరోలి దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్తో మాట్లాడినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు రాజ్నాథ్. రాష్ట్రప్రభుత్వంతో హోంశాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, అవసరమైన సహాయం అందిస్తుందని స్పష్టంచేశారు.
ఇదీ చూడండి: మహారాష్ట్రలో నక్సల్స్ దుశ్చర్య- 16 మంది బలి