కిర్గిజిస్థాన్కు వెళ్లేందుకు పాకిస్థాన్ గగనతలాన్ని ప్రధాని నరేంద్రమోదీ వినియోగించటం లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కిర్గిజ్ రాజధాని బిష్కెక్లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సుకు మోదీ రేపు బయల్దేరనున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ఈ ప్రకటన చేశారు.
"బిష్కెక్ వెళ్లేందుకు వీవీఐపీ విమానాల కోసం భారత ప్రభుత్వం రెండు మార్గాలను సూచించింది. ఒమన్, ఇరాన్, మధ్య ఆసియా దేశాల మీదుగా బిష్కెక్ వెళ్లాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం."