రవీంద్రనాథ్ ఠాగూర్ మార్గనిర్దేశనంలో విశ్వభారతి విశ్వవిద్యాలయం భారత స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశ జాతీయవాదానికి ఈ విద్యాలయం ముఖచిత్రంగా నిలిచిందని పేర్కొన్నారు.
శాంతినికేతన్లోని విశ్వభారతి యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు మోదీ. భారత్లోని ఆధ్యాత్మికత వల్ల మానవజాతి మొత్తం ప్రయోజనం పొందాలని ఠాగూర్ కోరుకున్నారని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితోనే ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
"విశ్వభారతి నుంచి ఉద్భవించిన సందేశాన్ని మన దేశం ప్రపంచానికి తెలియజేస్తోంది. యూనివర్సిటీ వందేళ్ల ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. గురుదేవ్(రవీంద్రనాథ్ ఠాగూర్) చింతన, దూరదృష్టి, కఠోర శ్రమకు ప్రతిరూపమే ఈ విశ్వభారతి."