తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2020, 8:13 PM IST

ETV Bharat / bharat

దేశవ్యాప్త 'స్వచ్ఛ భారత్'​ ప్రచారానికి మోదీ శ్రీకారం

దేశాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వచ్ఛ భారత్​ అభియాన్​లో భాగంగా వారం రోజుల పాటు ఆగస్టు 15 వరకు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

PM Narendra Modi
దేశవ్యాప్త 'స్వచ్ఛ భారత్'​ ప్రచారం ప్రారంభించిన మోదీ

దేశాన్ని చెత్తనుంచి విముక్తి చేసేందుకు.. వారం రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వచ్ఛభారత్ అభియాన్‌లో భాగంగా ఈ ప్రచార పర్వానికి దిల్లీలోని రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రంలో మోదీ శ్రీకారం చుట్టారు.

స్వచ్ఛభారత్​ ప్రచారాన్ని ప్రారంభిస్తోన్న మోదీ

ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాని. వారికి కరోనా జాగ్రత్తలను చెప్పారు. భౌతిక దూరం ఆవశ్యకతను వివరించారు. కరోనాపై పోరాటంలో స్వచ్ఛ భారత్ అభియాన్ సహాయకారిగా నిలుస్తుందని మోదీ ఆకాంక్షించారు.

కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు

ఆగస్టు 15 వరకు..

ఈ ప్రచారం ఆగస్టు 15 వరకు జరగనుంది. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించనున్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రీయ స్వచ్ఛ్​ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని

ABOUT THE AUTHOR

...view details