తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎస్​సీఓ దేశాలతో బంధాలు బలోపేతం చేసుకుంటాం'

కిర్గిస్థాన్లో జరగనున్న షాంఘై కోఆపరేషన్​ ఆర్గనైజేషన్​ సదస్సుకు ఇవాళ ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తోనూ మోదీ భేటీ అవుతారు.

By

Published : Jun 13, 2019, 4:47 AM IST

Updated : Jun 13, 2019, 5:42 AM IST

'ఆ దేశాలతో బంధాలు బలోపేతం చేసుకుంటాం'

'ఎస్​సీఓ దేశాలతో బంధాలు బలోపేతం చేసుకుంటాం'

కిర్గిస్థాన్​లో తాను జరపనున్న పర్యటన షాంఘై కోఆపరేషన్​ ఆర్గనైజేషన్​ (ఎస్​సీఓ) దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కిర్గిస్థాన్ రాజధాని బెష్కెక్​లో గురు, శుక్రవారాల్లో జరగనున్న ఎస్​సీఓ సమావేశాల్లో మోదీ పాల్గొననున్నారు.

ఈ సమావేశంలో ప్రపంచ భద్రత స్థితిగతులు, బహుముఖ ఆర్థిక సహకారం, ప్రజల మధ్య పరస్పరం సంబంధాల పురోగతిపై చర్చలు జరుపుతామని మోదీ తెలిపారు. కిర్గిస్థాన్ అధ్యక్షుడు జీన్​బెకోవ్​తో కలిసి భారత్​-కిర్గిజ్​ వాణిజ్య మండలి తొలి సమావేశంలో పాల్గొంటానని వివరించారు.

జిన్​పింగ్​తో భేటీ..

ఎస్​సీఓ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​... ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. మోదీ రెండోసారి ప్రధాని అయిన తరువాత ఈ ఇరువురు నేతలు భేటీ కానుండడం ఇదే మొదటిసారి.

పాక్​ మీదుగా ప్రధాని వెళ్లరు

షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు పాకిస్థాన్ గగనతలం మీదుగా ప్రధాని మోదీ ప్రయాణించరని విదేశీ వ్యవహారాలశాఖ (ఎంఈఏ) స్పష్టం చేసింది. పాక్ మీదుగా వెళ్తే బిష్కెక్​కు మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు. అదే ఒమన్, ఇరాన్​ల మీదుగా వెళ్తే ఏడు గంటల సమయం పడుతుంది.

ఇదీ చూడండి: WC19: ఫేవరేట్​ జట్లలో గెలుపు ఎవరిది...?

Last Updated : Jun 13, 2019, 5:42 AM IST

ABOUT THE AUTHOR

...view details