తెలంగాణ

telangana

By

Published : Aug 27, 2019, 12:37 PM IST

Updated : Sep 28, 2019, 11:00 AM IST

ETV Bharat / bharat

జైట్లీ కుటుంబసభ్యులకు ప్రధాని మోదీ పరామర్శ

ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ అరుణ్​జైట్లీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. జైట్లీ నివాసానికి వెళ్లి దివంగత నేతకు పుష్పాంజలి ఘటించారు. విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఆయన జైట్లీ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు.

జైట్లీ కుటుంబసభ్యులకు ప్రధాని మోదీ పరామర్శ

జైట్లీ కుటుంబసభ్యులకు ప్రధాని మోదీ పరామర్శ

దివంగత నేత అరుణ్​జైట్లీ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్రమోదీ పరామర్శించారు. ఇవాళ ఉదయం విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన మోదీ నేరుగా దక్షిణ దిల్లీలోని జైట్లీ నివాసానికి వెళ్లారు. జైట్లీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

జైట్లీ నివాసంలోనే 20-25 నిమిషాలు గడిపిన మోదీ... జైట్లీ భార్య, బిడ్డలను ఓదార్చారు. ప్రధాని కంటే ముందు జైట్లీ నివాసానికి వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్​షా జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించారు.

విదేశీ పర్యటన వల్లే..

దిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ అరుణ్​జైట్లీ (66) గత శనివారం కన్నుమూశారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆ సమయంలో మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. అందువల్ల ఆయన అంతిమయాత్రకు హాజరుకాలేకపోయారు. ఫోన్​ ద్వారా జైట్లీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చూడండి: 'ఆర్​బీఐ నుంచి సర్కారు డబ్బు దొంగతనం'

Last Updated : Sep 28, 2019, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details