కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు తమ ఆలోచనలు, సమస్యలను పంచుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనెల 28 న ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో చర్చించేందుకు ప్రజల నుంచి విలువైన సూచనలను ఆహ్వానిస్తున్నానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.
'మన్కీ బాత్'లో ఆలోచనలు పంచుకోండి: మోదీ - మన్ కీ బాత్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో.. ప్రజలు తమ ఆలోచనలు పంచుకోవాలను పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. తమ అభిప్రాయాలను 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రసారం చేస్తామని వివరించారు.
!['మన్కీ బాత్'లో ఆలోచనలు పంచుకోండి: మోదీ PM Modi said that Share your thoughts for Mann kee baat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7619326-thumbnail-3x2-modi.jpg)
'మన్కీ బాత్' కోసం ఆలోచనలు పంచుకోండి!
ఓపెన్ ఫోరం అయిన..'ల్వీబ్నిర్' షేర్ చేసి లేదా టోల్ఫ్రీ నెంబర్ 1800-11-7800 కు ఫోన్ చేసి తమ అభిప్రాయాలను పంచుకోవచ్చన్నారు మోదీ. హిందీ, ఇంగ్లీషు భాషల్లో సందేశాలను పంపించాలని చెప్పారు. అవన్నీ రికార్డవుతాయని, వాటిలో కొన్నింటిని ప్రసారం చేస్తామని స్పష్టం చేశారు.