తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోఫా వద్దు... అందరితోనే నేను: మోదీ

రష్యా పర్యటనలో మోదీ వీడియో ఒకటి వైరల్​ అవుతోంది. తూర్పు దేశాల ఆర్థిక సదస్సు అనంతరం.. ప్రధాని ఓ ఫొటో సెషన్​లో పాల్గొన్నారు. అధికారులు... ప్రధాని కోసం ప్రత్యేకంగా సౌకర్యవంతమైన సోఫాను ఏర్పాటు చేశారు. అయితే.. అందులో కూర్చునేందుకు తిరస్కరించిన మోదీ తనకూ కుర్చీనే వేయాలని సూచించారు.

సోఫా వద్దు... అందరితోనే నేను: మోదీ

By

Published : Sep 6, 2019, 10:16 AM IST

Updated : Sep 29, 2019, 3:10 PM IST

నిరాడంబరతతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న మోదీ

రష్యా పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఓ పని ఎంతగానో ఆకట్టుకుంటోంది. తూర్పు ఆర్థిక సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన మోదీ... ఓ ఫొటో సెషన్​లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని కోసం ప్రత్యేకంగా సౌకర్యవంతమైన సోఫాను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే... అందులో కూర్చోవడానికి మోదీ తిరస్కరించి అందరికీ వేసిన కుర్చీనే తనకూ వేయాలని సూచించారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు ఆ సోఫాను అక్కడి నుంచి తీసేసి.. మిగతా వారికి వేసిన కుర్చీనే ఏర్పాటు చేశారు.

ఈ దృశ్యాల్ని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. వీటిని చూసిన నెటిజన్లు... మోదీ నిరాడంబరతను కొనియాడుతున్నారు.

Last Updated : Sep 29, 2019, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details