తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముజిబుర్ రెహ్మాన్ గొప్ప ధైర్యం ఉన్న నాయకుడు-మోదీ

బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్​ శతజయంత్యుత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బంగ్లాదేశ్​ను​ మారణహోమం నుంచి బయటకు తీసుకురావడానికి రెహ్మాన్ తీవ్రంగా కృషిచేశారని పేర్కొన్నారు. ఆయన లక్షణాలు బంగ్లాదేశ్ యువతకు కొత్త శక్తినిచ్చాయని అన్నారు.

By

Published : Mar 17, 2020, 9:26 PM IST

pm modi participates in the birth centenary celebrations of jatir pita bangabandhu, sheikh mujibur rahman, via video conferencing
మోదీ

బంగ్లాదేశ్​ జాతిపిత షేక్​ ముజిబుర్ రెహ్మాన్​ గొప్ప ధైర్యమున్న నాయకుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్​లో నిర్వహించిన రెహ్మాన్ శత జయంత్యుత్సవ కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఆయనకు ఘన నివాళి తెలిపారు. బంగ్లాదేశ్​ను మారణహోమం నుంచి బయటకు తీసుకురావడానికి ముజిబుర్ రెహ్మాన్ తీవ్రంగా శ్రమించారని కొనియాడారు.

నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

"బంగాల్​ బంధు అంటే నమ్మకం ఉన్న వ్యక్తి. ధైర్యం కల నాయకుడు. శాంతి, న్యాయం, సమానత్వం, గౌరవానికి చిహ్నం. ఇటువంటి లక్షణాలు ఆయన కాలంలో బంగ్లాదేశ్ స్వేచ్ఛ కోసం అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు లక్షలాది మంది యువతకు కొత్త శక్తినిచ్చాయి."-నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

ఈ సందర్భంగా బంగ్లాదేశ్-భారత్​ మధ్య ఉన్న సంబంధాలను గుర్తు చేశారు. చారిత్రక కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానించినప్పటికీ కరోనా కారణంగా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్​ ఢాకాలో నేటి నుంచి ప్రారంభమై ఏడాది పొడవునా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు మోదీతో సహా పలువురు ప్రముఖులు హాజరవుతారని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఎలాంటి బహిరంగ సభలు లేకుండా జయంత్యుత్సవాలను నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details