తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నోబెల్​ విజేత అభిజిత్​పై మోదీ ప్రశంసల జల్లు - pm narendra modi

నోబెల్​ విజేత అభిజిత్​ బెనర్జీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. అభిజిత్​ విజయాలను చూసి భారత దేశం గర్వపడుతోందని మోదీ ట్వీట్​ చేశారు.

నోబెల్​ విజేత అభిజిత్​పై మోదీ ప్రశంసల జల్లు

By

Published : Oct 22, 2019, 12:48 PM IST

Updated : Oct 22, 2019, 2:47 PM IST

నోబెల్​ విజేత అభిజిత్​పై మోదీ ప్రశంసల జల్లు

నోబెల్​ విజేత, ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్​ బెనర్జీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై అభిజిత్​తో చర్చించారు.
బెనర్జీపై ప్రశంసల వర్షం కురిపించారు మోదీ. ప్రజాసాధికారత కోసం ఆర్థికవేత్త చేస్తున్న కృషిని కొనియాడారు. వీరి భేటీకి సంబంధించిన చిత్రాన్ని ట్విట్టర్​ ఖాతాలో పంచుకున్నారు ప్రధాని.

మోదీ- అభిజిత్​ భేటీ

"నోబెల్​ విజేత అభిజిత్​ బెనర్జీని కలవడం ఎంతో అద్భుతంగా ఉంది. ప్రజాసాధికారతకు ఆయన చేస్తున్న కృషి స్పష్టంగా కనపడుతోంది. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. ఆయన విజయాలను చూసి దేశం గర్వపడుతోంది. అభిజిత్ భవిష్యత్తు కార్యచరణ కోసం నా శుభాకాంక్షలు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ప్రపంచంలో నెలకొన్న పేదరికాన్ని నిర్మూలించేందుకు భిన్న ప్రణాళికలతో ప్రభుత్వాలకు సహకరించినందుకు అభిజిత్​ బెనర్జీతో పాటు ఆయన భార్య డఫ్లో, మైఖేల్​ క్రెమర్​లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్​ పురష్కారం వరించింది.

అయితే... బెనర్జీపై కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ సహా కొందరు భాజపా నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్​ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపాదించిన న్యాయ్ పథకాన్ని అభిజిత్ సమర్థించడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యవహారంపై అభిజిత్​ అసంతృప్తి వ్యక్తంచేయగా... భాజపా నేతల వైఖరిని కాంగ్రెస్​ తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో అభిజిత్​తో మోదీ భేటీ చర్చనీయాంశమైంది.

ఇవీ చూడండి:-

నోబెల్​ విజేత అభిజిత్​పై కేంద్ర మంత్రి విమర్శలు!

'నోబెల్ ఇస్తే నాకేంటి..? నా నిద్రే నాకు ముఖ్యం'

Last Updated : Oct 22, 2019, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details