కరోనా వైరస్ పరిస్థితిని సమీక్షించడానికి 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23న సమావేశమయ్యే అవకాశాలున్నాయి. దిల్లీ, ఉత్తర్ప్రదేశ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొననున్నారు.
దేశవ్యాప్తంగా ఆగస్టు 11న ప్రధాని నిర్వహించిన సమావేశానికి 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వారి ప్రతినిధులు హాజరయ్యారు.
కరోనా విజృంభణ తర్వాత ప్రధాని తరచూ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.