తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా​పై ఆ ఇద్దరు వైద్యులతో మోదీ ఏం మాట్లాడారు?

దిల్లీకి చెందిన డాక్టర్​ నితీశ్​ గుప్తా, పుణెకు చెందిన డాక్టర్​ బోర్సేతో ఫోన్​లో సంభాషించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మన్​కీబాత్​లో భాగంగా.. కరోనా రోగుల గురించి ఆరా తీశారు ప్రధాని. ఈ విపత్తు సమయంలో ప్రభుత్వం వైద్యులకు సాయం చేసేందుకు వెనుకాడదని మరోమారు పునరుద్ఘాటించారు మోదీ.

By

Published : Mar 29, 2020, 12:51 PM IST

PM Modi interacts with doctors upon coronavirus
మన్​కీబాత్​: కరోనా వైరస్​పై వైద్యులతో ముచ్చటించిన మోదీ

కరోనాపై పోరాటంలో వైద్యులకు కేంద్రప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని స్పష్టంచేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మన్​కీ బాత్​లో భాగంగా పలువురు వైద్యులతో ఫోన్​లో సంభాషించారు. కరోనాతో యావత్ దేశం యుద్ధం చేస్తున్న సమయంలో వైద్యులందరూ సైనికుల్లాగా పోరాడుతున్నారని కొనియాడారు. రోగులకు వైద్యంతో పాటు మనోధైర్యాన్ని నింపేలా.. కౌన్సెలింగ్​ కూడా ఇవ్వాలని డాక్టర్లకు సూచించారు ప్రధాని.

డాక్టర్​ నితీశ్ గుప్తాతో

దిల్లీకి చెందిన డాక్టర్ నితీశ్​ గుప్తాతో ఫోన్​లో మాట్లాడారు మోదీ. ఈ సందర్భంగా.. ఇతర దేశాల్లో పెరుగుతున్న మృతుల సంఖ్యను చూసి చాలా మంది భయపడుతున్నారని, ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని ప్రధానికి వివరించారు డాక్టర్ గుప్తా.

డాక్టర్​ బోర్సే

పుణెలోని బీజే వైద్య కళాశాల ప్రొఫెసర్​ డాక్టర్​ బోర్సేతోనూ ముచ్చటించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా కరోనా అంత ప్రమాదకర వ్యాధి కాదని.. తన ఆసుపత్రిలోని రోగులందరూ కోలుకుంటున్నట్లు మోదీకి వివరించారు బోర్సే. స్వీయ నిర్బంధంలో ఉన్నవారికి పలు సూచనలు చేశారు డాక్టర్​ బోర్సే.

  • స్వీయ నిర్బంధంలో ఉన్నవారు మొదటగా ఇతరుల నుంచి ఆరడుగుల దూరం పాటించాలి.
  • రెండోది నిర్బంధంలో ఉన్నవారు మాస్క్​లు ధరించాలి. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర శానిటైజర్ లేకుంటే.. సబ్బుతోనే పదేపదే చేతులు కడుక్కోండి.
  • తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా చేతిరుమాలు వినియోగించండి.

ABOUT THE AUTHOR

...view details