తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వినాయక చవితి శుభాకాంక్షలు: ప్రధాని, రాష్ట్రపతి

వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భగవంతుడి ఆశీర్వాదాలు ఎల్లవేళలా దేశ ప్రజలపై ఉంటాయని మోదీ ట్వీట్​ చేశారు.

By

Published : Aug 22, 2020, 9:40 AM IST

PM Modi greets people on Ganesh Chaturthi
ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిన మోదీ

దేశ ప్రజలందరికీ వినాయక చవితి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. గణేశుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా ప్రజలపై ఉంటాయని ట్వీట్​ చేశారు. ఆనందోత్సాహాలతో సౌభాగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ కూడా ప్రజలకు గణేశ్​ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ సమాజంలోని అన్నివర్గాలను కలుపుతుందని ట్వీట్​ చేశారు. కరోనా మహమ్మారిపై విజయం సాధించేందుకు భగవంతుడి సహకారం ఉంటుందని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండేలా ఆశీర్వాదాలు ఉంటాయన్నారు.

ఇంట్లోనే జరుపుకోండి..

కరోనా నేపథ్యంలో ఈ సారి వినాయక చవితి పండుగను ఇళ్లలోనే జరుపుకొందామని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. సమభావనకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ ద్వారా బాలగంగాధర్​ తిలక్ సామూహిక సమావేశాలతో జాతీయవాద భావాలను వ్యాప్తి చేశారని గుర్తు చేశారు.

ఇదీ చూడండి: 'భారత్ ప్రతిఘటనను చైనా ఊహించలేకపోయింది'

ABOUT THE AUTHOR

...view details