తెలంగాణ

telangana

By

Published : May 22, 2020, 4:18 PM IST

ETV Bharat / bharat

మోదీ మాట వెయ్యి కోట్లు- దీదీ పాట లక్ష కోట్లు

బంగాల్​లో 'అంపన్' తుపాను​ ప్రభావిత ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు ప్రధాని మోదీ. తక్షణ సాయంగా రూ.1000 కోట్లు ప్రకటించారు. అయితే ప్రకృతి విపత్తు కారణంగా రాష్ట్రానికి లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ.

pm modi announced advance interim assistance of Rs 1,000 crore
మోదీ మాట వెయ్యి కోట్లు.. దీదీ పాట లక్ష కోట్లు

ప్రచండ తుపాను 'అంపన్‌' బీభత్సానికి చిగురుటాకులా వణికిన బంగాల్​లో పరిస్థితుల్ని ప్రత్యక్షంగా పరిశీలించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ఏరియల్‌ సర్వేలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు ప్రకటించారు.

బంగాల్​ పునర్నిర్మాణంలో మమతతో కలిసి పనిచేస్తామన్నారు ప్రధాని మోదీ. నష్టపోయిన ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసానిచ్చారు. తూపాను వల్ల మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

మమత లెక్కలివే...

అంపన్​ దెబ్బకు రాష్ట్రంలో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని పేర్కొన్నారు బంగాల్​ సీఎం మమతా. విపత్తు ఫలితంగా రూ. లక్ష కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.

తుపాను కారణంగా ఇప్పటివరకు 80 మంది చనిపోగా.. వేల మంది నిరాశ్రయులయ్యారని.. భారీగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, మిధనాపుర్​, కోల్​కతా, హావ్​డా, హూజ్లే జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపిందని మమత వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details