క్రికెట్ ప్రపంచకప్ నుంచి భారత్ నిష్క్రమణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.న్యూజిలాండ్తోసెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమి నిరుత్సాహపరిచినా.. భారత జట్టు చివరి వరకు పోరాటం చేసిన తీరు అద్భుతమని కొనియాడారు.
టీమిండియా పోరాట పటిమ అద్భుతం: మోదీ - ప్రధానమంత్రి
క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఫలితం నిరుత్సాహపరిచినా.. టోర్నీ మొత్తం టీమిండియా అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడారు.

"'టీమిండియా పోరాట పటిమ అద్భుతం"
టోర్నీ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత జట్టు గొప్ప ప్రదర్శన చేసిందని ప్రశంసించారు ప్రధాని. జీవితంలో గెలుపు, ఓటములు సహజమని తెలిపారు. భవిష్యత్తులో టీమిండియా మంచి ప్రదర్శన చేయాలని ఆకాక్షించారు.
ఇదీ చూడండి: జడేజా, ధోనీ వీరోచిత ఇన్నింగ్స్ వృథా... ఫైనల్లో కివీస్
Last Updated : Jul 10, 2019, 8:59 PM IST