తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ వ్యాఖ్యలతో జవాన్లను అవమానించిన మోదీ'

భారత్​లోకి చొరబాట్లు జరగలేదని పేర్కొని.. సైనికులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవమానించారని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. భారత భూభాగంలోని చైనా సైనికులను ఎప్పుడు వెనక్కు పంపుతున్నారో చెప్పాలని డిమాండ్​ చేశారు.

By

Published : Oct 23, 2020, 3:11 PM IST

Rahul gandhi
కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్​ గాంధీ. లద్దాఖ్​లోని భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని పేర్కొనటం ద్వారా సైనికులను ప్రధాని అవమానించారని ఆరోపించారు. చైనా సైనికులను భారత భూభాగం నుంచి ఎప్పుడు పంపిస్తారో చెప్పాలని డిమాండ్​ చేశారు.

బిహార్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిసువాలో నిర్వహించిన తొలి ర్యాలీలో ఈ మేరకు విమర్శలు చేశారు రాహుల్​.

" వారు(చైనా) 1200 కిలోమీటర్ల మన భూమిని ఆక్రమించారు. కానీ.. ఎవరూ భారత భూభాగాన్ని ఆక్రమించలేదని చెప్పి మన సైనికులను ప్రధాని ఎందుకు అవమానించారు? మా ప్రశ్న ఒక్కటే, మోదీ జీ.. మన భూభాగంలో ఉన్న చైనా సైనికులను ఎప్పుడు వెనక్కు పంపిస్తారు? "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​తో వలస కార్మికులు ఇబ్బందులు పడ్డారంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్​ గాంధీ. ఇతర రాష్ట్రాలలో పని లేక బిహార్​ కార్మికులు వస్తే.. వారికి మోదీ ఏమీ చేయలేదని ఆరోపించారు. వారి ముందు మోకరిల్లటం తప్ప.. అవసరమైన సాయమేమీ అందించలేదన్నారు. బిహారీలకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో, ఎప్పుడు ఇచ్చారో తెలపాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:'అవినీతి చరితులను బిహార్​ ప్రజలు అనుమతించరు'

ABOUT THE AUTHOR

...view details