తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అది నిజమైతే... మోదీ దేశ ద్రోహానికి పాల్పడినట్లే' - భారత్

కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ... ప్రధాని మోదీపై సునిశితమైన విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజమైతే.. మోదీ దేశ ప్రయోజనాలను, 1972 సిమ్లా ఒప్పందానికి తూట్లు పొడిచి, ద్రోహానికి పాల్పడినట్లేనని వ్యాఖ్యానించారు.

'అది నిజమైతే... మోదీ దేశ ద్రోహానికి పాల్పడినట్లే'

By

Published : Jul 23, 2019, 2:46 PM IST

Updated : Jul 23, 2019, 4:50 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ వ్యాఖ్యలు నిజమైతే.... ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి, ద్రోహానికి పాల్పడినట్లేనని కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ వ్యాఖ్యానించారు.

"బలహీనమైన విదేశాంగ మంత్రిత్వశాఖ ఎన్ని కబుర్లు చెప్పినా లాభంలేదు. ప్రధాని మోదీ.. తనకు, ట్రంప్​కు మధ్య జరిగిన సమావేశంలో ఏం జరిగిందో దేశానికి తెలియజేయాలి" అని రాహుల్ డిమాండ్​ చేశారు.

"భారత్​, పాకిస్థాన్​ మధ్య ఉన్న కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ప్రధాని మోదీ తనను కోరారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ చెప్పారు. ఇదే నిజమైతే.... ప్రధాని మోదీ భారత ప్రయోజనాలకు, 1972 సిమ్లా ఒప్పందానికి ద్రోహం చేసినట్లే."
-రాహుల్​గాంధీ, కాంగ్రెస్ నేత

'అది నిజమైతే... మోదీ దేశ ద్రోహానికి పాల్పడినట్లే'

మోదీ... మౌనం ఎందుకు?

కశ్మీర్​ అంశంలో భారత్, పాక్​ మధ్య తృతీయ పక్షం జోక్యం అనవసరమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రకటనను నిన్న కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అయితే ట్రంప్​ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించింది.

ఖండించిన విదేశాంగమంత్రి

ట్రంప్​ వ్యాఖ్యలను విదేశాంగమంత్రి జైశంకర్​తోసిపుచ్చారు. ప్రధాని మోదీ ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని కోరలేదని రాజ్యసభలో స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: బలపరీక్ష జరుగుతుందని సుప్రీం ఆశాభావం

Last Updated : Jul 23, 2019, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details