మహమ్మారి కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని 'ఆత్మ నిర్భర్ భారత్' (స్వావలంబన భారత్) సాధించడమే.. దేశ లక్ష్యమని జాతినుద్దేశించి చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మాటలను ప్రేరణగా తీసుకొని... ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్(ఇస్రా)కు చెందిన 211 మంది గాయకులు ఓ పాట రూపొందించారు. దీనిని ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. ఈ గేయంపై ప్రధాని ట్విట్టర్ వేదికగా ప్రసంశలు జల్లు కురిపించారు.
'ఆత్మ నిర్భర్ భారత్' పాటపై మోదీ ప్రశంసలు - Prime Minister Narendra Modi
ఇటీవల జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ... స్వయం సమృద్ధి(ఆత్మ నిర్భర్ భారత్) సాధించాలని పిలుపునిచ్చారు. దీనిని ప్రేరణగా తీసుకొని 'ఆత్మ నిర్భర్ భారత్' కోసం రూపొందించిన పాటను ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. ఆ గీతంపై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ.
!['ఆత్మ నిర్భర్ భారత్' పాటపై మోదీ ప్రశంసలు PM appreciates song inspired by his call for 'atma-nirbhar' India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7240151-thumbnail-3x2-modi.jpg)
ఆత్మనిర్భర్ భారత్ పాటపై మోదీ ప్రశంసలు
"ఈ గీతం 'ఆత్మ నిర్భర్ భారత్ లేదా స్వావలంబన భారత్' కోసం ప్రేరణ కలిగిస్తుంది." అని ట్వీట్ చేశారు మోదీ. ఈ గీతం అందరిలోనూ ఉత్సాహాన్ని నింపుతుందన్నారు.
ఇదీ చూడండి:ఇజ్రాయెల్ ప్రధానికి మోదీ శుభాకాంక్షలు