తెలంగాణ

telangana

By

Published : May 6, 2019, 12:52 PM IST

Updated : May 6, 2019, 2:18 PM IST

ETV Bharat / bharat

సీజేఐపై 'కుట్ర': సీబీఐ దర్యాప్తునకు అభ్యర్థన

సీజేఐపై కుట్ర వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలైంది.  పిటిషన్​పై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. తర్వాత వాదనలు వింటామని చెప్పింది.

సీజేఐపై 'కుట్ర' వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు అభ్యర్థన

సీజేఐపై 'కుట్ర': సీబీఐ దర్యాప్తునకు అభ్యర్థన

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్ గొగొయిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్​ దాఖలైంది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్​, న్యాయవాది ఎంఎల్​ శర్మ అభ్యర్థించారు.

సీబీఐతో ఎఫ్​ఐఆర్​ నమోదు చేయించాలన్న పిటిషన్​పై ఈనెల 8న విచారణ చేపట్టాలని శర్మ సుప్రీంకోర్టును కోరారు. ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది. తొందరేంటని ప్రశ్నిస్తూ... అత్యవసర విచారణ అవసరం లేదని జస్టిస్​ ఎస్​ఏ బాబ్డే, జస్టిస్​ ఎస్​ అబ్దుల్​ నజీర్​ల ధర్మాసనం తేల్చిచెప్పింది. తరువాత విచారణ చేపడతామని తెలిపింది.

ఇదీ చూడండి:ఫొని ప్రభావిత ప్రాంతాల్లో మోదీ ఏరియల్​ సర్వే

Last Updated : May 6, 2019, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details