తెలంగాణ

telangana

By

Published : Jan 12, 2020, 7:35 PM IST

Updated : Jan 12, 2020, 11:48 PM IST

ETV Bharat / bharat

విమానం పేల్చేస్తానని బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్​

ఎయిర్​ ఏసియా విమానంలో ఓ మహిళ కలకలం సృష్టించింది. తన శరీరం చుట్టు బాంబులున్నాయని విమాన అధికారులను బెదిరించింది. ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు విమానాన్ని కోల్​కతా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్​ చేశారు అధికారులు. తీరా చూస్తే.. ఆ మహిళ చెప్పిందంతా ఉత్తి మాటలేనని తేలింది.

plane-makes-emergency-landing-at-kolkata-after-woman-claims-she-has-bombs
విమానం పేల్చేస్తానని బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్​

విమానం పేల్చేస్తానని బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్​

ఎయిర్​ ఏసియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ తన వద్ద బాంబు ఉందని బెదిరింపులకు పాల్పడింది. ఈ కారణంగా శనివారం రాత్రి కోల్​కతా నుంచి ముంబయికి బయల్దేరిన విమానం వెనుదిరిగి తిరిగి కోల్​కతా విమానాశ్రయంలో​ అత్యవసరంగా ల్యాండింగ్​ అయింది.

ఏ సమయంలోనైనా పేలొచ్చనీ...

25 ఏళ్ల మోహినీ మాండల్.. ఎయిర్​ ఏసియా (15316) విమానంలో ముంబయికి బయల్దేరింది. ​విమానం గాల్లోకి ఎగిరిన గంట సమయం తర్వాత ఓ నోట్​ రాసి కేబిన్​ సిబ్బందికి ఇచ్చింది. దాన్ని విమాన కెప్టెన్​కు ఇవ్వమని సూచించింది. ఆ నోట్​లో తన శరీరం చుట్టూ బాంబులున్నాయనీ, అవి ఏ క్షణంలోనైనా పేలొచ్చని రాసింది. విషయం తెలుసుకున్న పైలట్లు అధికారులకు సమాచారం అందించి.. విమానాన్ని వెనక్కి మళ్లించారు​.

రాత్రి 11:46 గంటలకు విమానం కోల్​కతా విమానాశ్రంలో ల్యాండింగ్​ అయిన తర్వాత అందులో క్షుణ్నంగా తనిఖీ చేశారు అధికారులు. మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో తన వద్ద ఎలాంటి బాంబులు లేవని చెప్పటం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. ఆ మహిళ మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు గుర్తించిన అధికారులు తిరిగి ముంబయికి పంపించారు.

ఇదీ చదవండి:రాజస్థాన్​లో పండగ కోసం ముస్తాబైన 'ఒంటెలు'

Last Updated : Jan 12, 2020, 11:48 PM IST

ABOUT THE AUTHOR

...view details