తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శివసేన, కాంగ్రెస్​, ఎన్​సీపీలపై సుప్రీంలో పిటిషన్​

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ పార్టీలు సంకీర్ణంగా ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలైంది. ఎన్నికల ముందు భాజపాతో కలిసి పోటీ చేసిన శివసేన అనంతరం ఎన్​సీపీతో కలవటం ప్రజలను మోసం చేయటమేనని.. నూతన సంకీర్ణం నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టకుండా కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేయాలని తన వ్యాజ్యంలో అభ్యర్థించారు పిటిషనర్.

By

Published : Nov 15, 2019, 6:16 AM IST

శివసేన, కాంగ్రెస్​, ఎన్​సీపీలపై సుప్రీంలో పిటిషన్​

మహారాష్ట్రలో శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్ పార్టీలు సంకీర్ణ కూటమిగా ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో.. దీనిని సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎన్నికల సమయంలో భాజపాతో పొత్తు పెట్టుకొని ఫలితాల అనంతరం.. అధికారమే లక్ష్యంగా ఎన్​సీపీతో కలవటం ప్రజలను మోసం చేయడమేనని ప్రమోద్ పండిట్ జోషి అనే వ్యక్తి సుప్రీంలో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ పార్టీలకు చెందిన నేతలు ముఖ్యమంత్రి పదవి చేపట్టకుండా కేంద్ర, రాష్ట్రాలను ఆదేశించాలని సుప్రీంకు విజ్ఞప్తి చేశారు పిటిషనర్.

'శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ పార్టీల కలయిక అనైతికమైనది. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ పార్టీలు యోచిస్తున్నాయి. ఈ పార్టీల సంకీర్ణంతో ఏర్పాటయ్యే ప్రభుత్వం ప్రజామోదం పొందినది కాబోదని' వ్యాజ్యం విచారణ సందర్భంగా పిటిషనర్​ తరఫు న్యాయవాది బారున్ కుమార్ సిన్హా వాదనలు వినిపించారు.

ఎన్నికల ఫలితాల తర్వాత రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు కలిసి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం రాజ్యాంగ విరుద్దమని పిటిషన్​లో పేర్కొన్నారు జోషి. ఈ పార్టీలు ప్రజామోదం పొందలేదని పిటిషన్​లో వివరించారు. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న పార్టీలకు మాత్రమే అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అసోంలో ఘనంగా బ్రహ్మపుత్ర పుష్కర మేళా

ABOUT THE AUTHOR

...view details