తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ సీఎం కేజ్రివాల్​పై దాడి.. రోడ్​షోలో ఘటన

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్​పై ఓ వ్యక్తి దాడి చేశాడు. దిల్లీలోని మోతీనగర్​లో రోడ్​షో నిర్వహిస్తుండగా జరిగిందీ ఘటన. దాడి చేసిన వ్యక్తి కైలాశ్​ పార్కు ప్రాంతానికి చెందిన సురేశ్​గా గుర్తించారు పోలీసులు.

By

Published : May 4, 2019, 6:53 PM IST

Updated : May 4, 2019, 10:14 PM IST

కేజ్రివాల్​పై యువకుడి దాడి..

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్​పై దాడి

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రివాల్​పై సురేశ్​ అనే వ్యక్తి దాడి చేశాడు. కొత్త దిల్లీ ఆప్​ అభ్యర్థి బ్రిజేశ్​ గోయల్​ తరఫున మోతీనగర్​లో ప్రచారం చేస్తున్న కేజ్రివాల్​ చెంపపై కొట్టాడు. రోడ్​షోలో ప్రసంగించిన అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా అకస్మాత్తుగా జీపుపైకి దూసుకొచ్చాడు ఆ వ్యక్తి. కేజ్రివాల్​పై దాడికి దిగాడు.

దాడికి పాల్పడిన వ్యక్తిని చితకబాదారు ఆమ్​ఆద్మీ కార్యకర్తలు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.

వివరాలు వెల్లడించిన పోలీసులు

దాడి చేసిన వ్యక్తి కైలాశ్​ పార్కు ప్రాంతానికి చెందిన సురేశ్​గా గుర్తించామని తెలిపారు పోలీసు అధికారులు. ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్నాడని, విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు.

కేజ్రివాల్​పై భౌతికదాడి జరగడం ఇది రెండోసారి.

Last Updated : May 4, 2019, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details