తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎంపీకే తప్పని కుల వివక్ష- ఊళ్లోకి రాకుండా అడ్డగింత

దేశంలో ఎక్కడోచోట ఇప్పటికీ అంటరానితనం కనిపిస్తూనే ఉంది. వెనుకబడిన సామాజిక వర్గాలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. సామాన్యులనే కాదు.. ప్రజాప్రతినిధులనూ ఈ వివక్ష వెంటాడుతోంది. తాజాగా కర్ణాటక చిత్రదుర్గ ఎంపీ నారాయణస్వామిని తక్కువ కులానికి చెందిన వారని ఊళ్లోకి రాకుండా అడ్డుకున్నారు గ్రామస్థులు. చేసేదేం లేక చివరకు ఆయనే వెనుదిరగాల్సి వచ్చింది.

By

Published : Sep 17, 2019, 2:53 PM IST

Updated : Sep 30, 2019, 10:53 PM IST

ఎంపీకే తప్పని కుల వివక్ష- ఊళ్లోకి రాకుండా అడ్డగింత

ఎంపీకే తప్పని కుల వివక్ష- ఊళ్లోకి రాకుండా అడ్డగింత

భాజపా సీనియర్​ నేత, కర్ణాటక చిత్రదుర్గ ఎంపీ నారాయణస్వామికి చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమం కోసం తన సొంత నియోజకవర్గంలోని ఓ గ్రామంలో పర్యటించాలనుకున్న ఆయనను అడ్డగించారు గ్రామస్థులు. తక్కువ కులానికి చెందిన వారని తీవ్ర అవమానానికి గురిచేశారు. గ్రామంలోకి అనుమతించమని స్పష్టం చేశారు.

నారాయణస్వామి పెమనహళ్లి గొళ్లారహత్తి గ్రామాన్ని సందర్శించాలనుకున్నారు. అయితే.. మూఢనమ్మకాలపై అపారమైన విశ్వాసమున్న గ్రామస్థులు ఆయనను అడ్డగించారు. ఇదే విషయమై ఊర్లోని ఓ పెద్దాయన నేరుగా ఎంపీకే బదులిచ్చారు.

''ఇది మా సంప్రదాయం. మేం తక్కువ కులం వారిని మా గ్రామంలోకి అనుమతించం. మేం అలాంటి వారిని మా ఆధ్యాత్మిక ప్రదేశాలకు దూరంగా ఉంచాలనుకుంటాం. ఎన్నో ఏళ్లుగా ఇదే పాటిస్తున్నాం. అందుకే మేం మిమ్మల్ని కూడా ఊర్లోకి రానీయం.''

- గ్రామస్థుడు

ఈ ఘటన అనంతరం... నారాయణస్వామి గ్రామస్థులతో మాట్లాడారు. తీవ్ర అసహనానికి గురైన ఆయన ప్రజలు చైతన్యవంతం కావాలన్నారు.

''ఈ రకమైన సంప్రదాయాలు, నమ్మకాలు మంచివి కావు. ఇలాంటి కార్యకలాపాలు ఆగిపోవాలి. వీటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.''

- నారాయణస్వామి, చిత్రదుర్గ ఎంపీ

Last Updated : Sep 30, 2019, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details