తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆపరేషన్​ కశ్మీర్​: ప్రధాని హామీకి నేతల డిమాండ్​

జమ్ముకశ్మీర్​ ప్రజల నమ్మకానికి భంగం కలిగేలా ఎలాంటి చర్యలు తీసుకోమని ప్రధాని హామీ ఇవ్వాలని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కోరింది. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయొద్దని స్పష్టం చేసింది.

By

Published : Aug 4, 2019, 7:43 AM IST

ప్రధాని హామీకి నేతల డిమాండ్​

జమ్ముకశ్మీర్​లో తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీని విన్నవించింది పీపీల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ). కశ్మీర్​ అంశంలో ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోబోమని ప్రధాని హామీ ఇవ్వాలని పీడీపీ శ్రేణులు కోరారు.

రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పీడీపీ అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై రాష్ట్ర ప్రజలు విశ్వాసంతో ఉన్నారని ఉద్ఘాటించారు. ప్రజల నమ్మకాన్ని ప్రధాని వమ్ముచేయరని భావిస్తున్నట్లు పీడీపీ పేర్కొంది. అలా కాకుండా రాజ్యాంగ మార్పునకు, ఏవైనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే అది ప్రజల గౌరవాన్ని అవహేళన చేసినట్లేనని వెల్లడించింది.

ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధానికి పార్టీ నేతలు విన్నపించారని పీడీపీ అధికార ప్రతినిధి తెలిపారు. కశ్మీర్​లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన ఉన్నందున రాష్ట్ర సంరక్షణ బాధ్యత కేంద్రానిదేనని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితులు, జమ్ముకశ్మీర్ రాజ్యాంగ హక్కులపై రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరును ప్రశంచించింది పీడీపీ.

ఇదీ చూడండి: 'కశ్మీర్​కు ఉగ్రముప్పు ఉంది- అటు వైపు వెళ్లకండి'

ABOUT THE AUTHOR

...view details