తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గంజాయి సాగుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం! - మధ్య ప్రదేశ్ గంజాయి

మధ్యప్రదేశ్​లో గంజాయి జాతికి చెందిన జనపనారను పండించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి వెల్లడించారు. క్యాన్సర్ మందుల తయారీలో ఉపయోగించే ఈ మొక్కల సాగు చేపట్టనున్నట్లు తెలిపారు. కేవలం వైద్య అవసరాల కోసమే పండిస్తున్నట్లు స్పష్టం చేశారు.

గంజాయిని పండించేందుకు సిద్ధమైన ప్రభుత్వం!

By

Published : Nov 21, 2019, 1:09 PM IST

మధ్యప్రదేశ్​లో గంజాయి జాతికి చెందిన జనపనార (హెంప్​)ను పండించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు మధ్యప్రదేశ్​ మంత్రి పీసీ శర్మ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంజాయి సాగు ప్రారంభించినట్లు తెలిపారు.

సతీవా జాతికి చెందిన ఈ గంజాయి రకం మొక్కను.. వైద్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. క్యాన్సర్​ వ్యాధి నివారణకు ఉపయోగించే మందుల తయారీలో వీటిని వినియోగిస్తారు. అంతేకాక బట్టలు, బయో ప్లాస్టిక్​ వంటి ఉత్పత్తులలో ఈ రకం మొక్కలను వాడతారు.

ఈ రకం మొక్కలను ఇప్పటికే ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాలలో పండిస్తున్నారని మంత్రి వివరించారు. ఈ గంజాయి మత్తు కోసం కాదని స్పష్టం చేసిన ఆయన...కేవలం క్యాన్సర్ మందులలో ఉపయోగించడానికేనని తెలిపారు.

'ఇది గంజాయి కాదు. దీనిని హెంప్​ అని అంటారు. ఇది గంజాయి జాతికి చెందినది. భాజపా అధికారంలో ఉన్న ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లలో ఈ పంటను పండిస్తున్నారు. దీనిని క్యాన్సర్ మందులలో ఉపయోగిస్తారు. బట్టల తయారీలోనూ వాడతారు. దీని వల్ల మధ్యప్రదేశ్​లో కొత్త ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచంలో చాలా చోట్ల ఉత్పత్తి జరుగుతోంది. దీనికోసం అంతర్జాతీయ నిపుణులతో చర్చలు జరుపుతున్నాం. ఇది తినడానికో, తాగడానికో మాత్రం కాదు.'-పీసీ శర్మ, మధ్యప్రదేశ్​ న్యాయ శాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details