తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​లో ఎన్​సీపీ విలీనం కాదు : పవార్​

కాంగ్రెస్​లో నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ (ఎన్​సీపీ) విలీనమవుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ఆ పార్టీ అధినేత శరద్​ పవార్​. తమ పార్టీకి సొంత గుర్తింపు ఉంది దానిని అలాగే కొనసాగిస్తామన్నారు. మిత్రపక్షాలతో తమ పార్టీ కలిసి ఉండటం ఇష్టం లేని వాళ్లు చేస్తోన్న తప్పుడు ప్రచారాలని కొట్టిపారేశారు.

By

Published : Jun 1, 2019, 11:55 PM IST

కాంగ్రెస్​లో ఎన్​సీపీ విలీనం కాదు : పవార్​

కాంగ్రెస్​ పార్టీలో నేషనలిస్ట్ కాంగ్రెస్​ పార్టీ (ఎన్​సీపీ) విలీనమవుతుందన్న వార్తలపై స్పష్టతనిచ్చారు ఆ పార్టీ అధినేత శరద్​ పవార్​. ఈ ఊహాగానాలన్నీ తప్పుడు వార్తలుగా కొట్టిపారేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, లోక్​సభ ఫలితాలపై చర్చించేందుకు శనివారం ముంబయిలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు పవార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్​సీపీకి సొంత గుర్తింపు ఉందని.. దానిని అలాగే నిలుపుకుంటామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​లో ఎన్​సీపీ విలీనం చేయటమనేది మిత్రపక్షాలతో తమ పార్టీ కలిసి ఉండటం ఇష్టం లేని వాళ్లు చేస్తోన్న తప్పుడు ప్రచారాలని కొట్టిపారేశారు.

లోక్​సభ ఎన్నికల ఫలితాల అనంతరం శరద్​ పవార్​ను కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ కలవటమే కాంగ్రెస్​-ఎన్​సీపీ విలీనంపై ఊహాగానాలకు తెరలేపింది.

ఈవీఎంలపై ఆరోపణలు..

పార్టీ నేతలతో సమావేశమైన పవార్​ ఈవీఎంలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈవీఎంల సాంకేతికతపై తనకు అనుమానాలున్నాయని తెలిపారు. భాజపా అధికారంలో ఉన్నప్పుడు రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైందని గుర్తు చేశారు. అప్పుడు ఓటమి చెందిన పార్టీ..జాతీయ ఎన్నికల్లో విజయం సాధించటం అనుమానాలకు తావిస్తోందన్నారు.

ఇదీ చూడండి:'దీదీకి 10 వేల జై శ్రీరామ్​ పోస్టుకార్డులు'

ABOUT THE AUTHOR

...view details