తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మీ ఇళ్లలోకి వచ్చి రేప్ చేస్తారు: భాజపా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు - parvesh verma on kejrival aam admi party

దిల్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ భాజపా ఎంపీ పర్వేశ్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్​ను ఎన్నుకుంటే మెజారిటీ ప్రజలపై అకృత్యాలు జరుగుతాయని పేర్కొన్నారు. భాజపాతోనే దిల్లీ ప్రజలకు రక్షణ లభిస్తుందన్నారు.

parvesh verma
పర్వేశ్ వర్మ

By

Published : Jan 28, 2020, 10:47 AM IST

Updated : Feb 28, 2020, 6:23 AM IST

దిల్లీ ఎన్నికల పోలింగ్​కు మరికొద్ది రోజులు ఉన్న నేపథ్యంలో భాజపా ఎంపీ పర్వేశ్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిల్లీలోని షహీన్ భాగ్​ నిరసనలపై తీవ్రంగా స్పందించారు. కశ్మీరీ పండితులపై జరిగిన అకృత్యాలను పోలిన ఘటనలే షహీన్​భాగ్​లోనూ చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు. తమకు రక్షణగా నిలబడే పార్టీనే ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు.కేజ్రీవాల్​ను ఎన్నుకుంటే కశ్మీర్ వంటి చోట్ల జరిగిన అకృత్యాలు దిల్లీ ప్రజలపైనా పునరావృతం అవుతాయని హెచ్చరించారు పర్వేశ్.

"అరవింద్ కేజ్రీవాల్ షహీన్ భాగ్​కు అండగా నిలుస్తానని చెబుతున్నారు. మనీశ్ సిసోడియా అదే చెప్పారు. దిల్లీలో రేగిన ఈ రకమైన అల్లర్లు ఇంతకుముందు కశ్మీర్​లో కనిపించాయి. కశ్మీరీ పండితుల కుమార్తెలపై అత్యాచారాలు జరిగాయి. ఉత్తర ప్రదేశ్​, హైదారబాద్​లోనూ అలానే జరిగింది. ప్రస్తుతం దిల్లీలోని షహీన్​ భాగ్​లో లక్షలమంది గుమిగూడారు. తర్వాత వారు దిల్లీ ప్రజల ఇళ్లలోకి చొరబడతారు. ఆడవాళ్లపై అకృత్యాలు చేస్తారు. దిల్లీ ప్రజలు ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల అనంతరం మోదీ, షా మిమ్మల్ని కాపాడేందుకు రాలేరు. మీరు ఇప్పుడే జాగ్రత్తపడితే బాగుంటుంది. దేశానికి ప్రధానమంత్రిగా మోదీ ఉంటేనే ప్రజలు సురక్షితంగా ఉన్నామని భావిస్తారు."

-పర్వేశ్ వర్మ, భాజపా ఎంపీ

ఇదీ చూడండి: 54 అడుగుల జెండాతో 'పౌర చట్టం'పై నిరసన

Last Updated : Feb 28, 2020, 6:23 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details