తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అ'సాధారణ' వ్యక్తిత్వం.. పారికర్ ప్రస్థానం

ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతితో గోవా భాజపా పెద్దదిక్కును కోల్పోయింది. ఎలాంటి సమస్యనైనా తనదైన శైలి పరిష్కారాన్ని చూపగల పారికర్ రాజకీయ ప్రస్థానం భవిష్యత్​ తరాలకు ఓ పాఠం.

By

Published : Mar 18, 2019, 8:30 AM IST

Updated : Mar 18, 2019, 8:48 AM IST

పారికర్ రాజకీయ ప్రస్థానం

అ'సాధారణ' వ్యక్తిత్వం..

ఓ ఇంజినీర్ రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో తెలుసా... ఆరెఎస్​ఎస్ కార్యకర్త నుంచి రక్షణమంత్రిగా ఎదిగితే ఎలా ఉంటుందో తెలుసా... గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ఆ విషయం బోధపడుతుంది.

పాఠశాల దశలోనే ఆర్​ఎస్​ఎస్​లో చేరారు పారికర్. ఐఐటీ నుంచి పట్టభద్రుడైన అనంతరమూ అందులోనే కొనసాగారు. ఆర్​ఎస్​ఎస్​ వ్యక్తిగా అంగీకరించేందుకు ఏమాత్రం సంకోచించని ముక్కుసూటి వ్యవహార శైలి పారికర్ సొంతం.

అనంతర కాలంలో ఆధునిక భావాలున్న నేతగా రూపాంతరం చెందారు పారికర్. సాధారణ జీవనశైలి, అసాధారణ నడవడికతో గోవా ప్రజల్లో మనవాడనే ముద్ర వేయగలిగారు. రాష్ట్రంలో భాజపాకు ట్రబుల్ షూటర్​గా ఎదిగి రెండు దశాబ్దాల పాటు గోవా రాజకీయాల్ని శాసించారు.

సాధారణ దుస్తులు ధరించి రిక్షాలో విమానాశ్రయానికి వెళ్లేవారు పారికర్. తన వస్తువులు తానే మోసుకుంటూ దిల్లీ నార్త్​బ్లాక్​లో కనిపించేవారు. ఎంత సాదాసీదాగా ఉండేవారో నిర్ణయాల్లో అంతే కటువుగా ఉండేవారు. రఫేల్ ఒప్పందంలో ప్రధాని కార్యాలయ ప్రమేయాన్ని నిర్ద్వంద్వంగా తప్పుపట్టినట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. ఆర్​ఎస్​ఎస్​ బోధనలే లక్షిత దాడులపై నిర్ణయం తీసుకునేందుకు దోహదం చేశాయని బాహాటంగా ప్రకటించుకున్నారు పారికర్.

ఓ ఆహార నాళికను నాసికలో ధరించి గోవా అభివృద్ధి పనుల్ని పరిశీలించిన పారికర్​ను గుర్తుచేసుకుంటే ఆయనలోని నిబద్ధత కళ్లకు కడుతుంది. 2018 ఫిబ్రవరిలో అనారోగ్యానికి గురైన పారికర్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కొద్దిరోజులుగా గోవా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ అనంత లోకాలకు చేరారు.

ఇదీ చూడండి: గోవా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి?

Last Updated : Mar 18, 2019, 8:48 AM IST

ABOUT THE AUTHOR

...view details