తెలంగాణ

telangana

By

Published : Sep 22, 2020, 1:34 PM IST

ETV Bharat / bharat

నిత్యావసర వస్తువుల బిల్లుకు ఆమోదం

నిత్యావసర వస్తువుల సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి ఉత్పత్తులను నిత్యావసర వస్తువల జాబితా నుంచి తొలగించాలని ఈ బిల్లు చెబుతోంది. దీనితో పాటు కంపెనీల సవరణ బిల్లు, బ్యాంకింగ్​ నియంత్రణ​ సవరణ బిల్లును కూడా ఆమోదించింది పార్లమెంటు.

Parliament passes  Essential Commodities (Amendment) Bill 2020
నిత్యావసర వస్తువల సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులో ఒకటైన నిత్యావసర వస్తువుల​ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. కొద్దిరోజుల క్రితమే లోక్​సభ ఆమోదం పొందిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభ గడప దాటింది.

యుద్ధం వంటి ప్రత్యేక పరిస్థితులు, అసాధారణంగా ధరలు పెరగడం వంటి సందర్భాల్లో తప్ప చిరు ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పండ్లు, కూరగాయలు సహా పలు నిత్యావసర వస్తువుల నిల్వ, సరఫరాపై ఎలాంటి నియంత్రణలూ ఉండబోవన్నది నిత్యావసర సరకుల చట్టసవరణ ప్రధానోద్దేశం.

మరికొన్ని...

కొత్తగా స్థాపించిన ఐదు ఐఐఐటీలను జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలుగా ప్రకటించే బిల్లును కూడా పార్లమెంటు ఆమోదించింది.

వీటితో పాటు కంపెనీల సవరణ బిల్లు, బ్యాంకింగ్​ రెగ్యులేషన్​ సవరణ బిల్లుకు కూడా ఆమోద ముద్ర వేసింది పార్లమెంటు.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details