పెళ్లి కాకుండానే గర్భవతి అయిన కూతుర్ని కిరాతకంగా నరికి చంపారు ఉత్తర్ప్రదేశ్ ప్రతాప్గఢ్ జిల్లా కిషన్దాస్పుర్ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు. ఈ హత్యను ఎవరో చేసినట్టు చిత్రీకరించాలనుకున్నారు. కానీ దర్యాప్తులో దొరికిపోయి... జైలుపాలయ్యారు.
ఏం జరిగింది?
అక్టోబరు 25న ప్రతాప్గఢ్ జిల్లా అలపుర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని నవాబ్గంజ్ పోలీసులు గుర్తించారు. తన కూతుర్ని ఎవరో హత్య చేశారని మృతురాలి తండ్రి కమలేష్ కుమార్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న నవాబ్గంజ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తల్లిదండ్రులనూ విచారించగా అసలు విషయం బయటపడింది.
ఎందుకు చంపారు?
"అస్వస్థతకు గురైన కూతుర్ని అక్టోబరు 24న తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలు 6నెలల గర్భవతి అని వైద్యులు నిర్ధరించారు. దీంతో అబార్షన్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. గర్భం వచ్చేందుకు కారణమైన వ్యక్తి ఎవరని ఎన్నిసార్లు అడిగినా ఆ యువతి సమాధానం చెప్పలేదు. విసుగు చెందిన తల్లిదండ్రులు ఆమెను నరికి చంపారు" అని నవాబ్గంజ్ పోలీస్ స్టేషన్ అధికారి అఖిలేష్ ప్రతాప్ సింగ్ తెలిపారు.