తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్వారంటైన్​ కేంద్రం నుంచి కాపాడిన అలుగుకు కరోనా! - Odisha forest officers rescued pangolin

ఒడిశా కటక్ జిల్లాలోని మహౌలియా క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ఒక అలుగును (పంగోలిన్) అథాగడ్ అటవీ డివిజన్ అధికారులు కాపాడారు. ఆ పాంగోలిన్​ నిర్బంధ కేంద్రంలో ఉన్నందున కరోనా సోకిందని అనుమానం వ్యక్తంచేశారు​. ఈ క్రమంలోని అలుగుకు కరోనా పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

Pangolin rescued from quarantine centre in Odisha to be tested for COVID19
క్వారంటైన్​ కేంద్రం నుంచి కాపాడిన అలుగుకు కరోనా!

By

Published : May 27, 2020, 9:55 AM IST

క్వారంటైన్ కేంద్రం నుంచి కాపాడిన ఒక అలుగుకు... కొవిడ్‌-19 పరీక్ష చేయాలని ఒడిశా అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. ఇటీవల ఒడిశా కటక్ జిల్లాలోని మహౌలియా క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ఒక అలుగును అథాగడ్ అటవీ డివిజన్ అధికారులు కాపాడారు.

స్థానిక సర్పంచ్ ఇచ్చిన సమాచారంతో అలుగును తీసుకెళ్లారు అధికారులు. క్వారంటైన్ కేంద్రంలో ఉన్నందున కరోనా సోకిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అలుగుకు కూడా కొవిడ్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఒక పాంగోలిన్‌కు కరోనా పరీక్ష చేయాలని నిర్ణయించడం ఇదే తొలిసారని ఒడిశా అటవీశాఖ అధికారులు వెల్లడించారు. పాంగోలిన్‌ ద్వారా వైరస్‌ విస్తరిస్తుందని అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇదీ చూడండి:భారీ వర్షాలతో నీటమునిగిన జనావాసాలు

ABOUT THE AUTHOR

...view details