తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్ ఆశ్రయంలో పాక్ ఎమ్మెల్యే- స్వదేశం వైపే పీఓకే ప్రజల మొగ్గు!

దాయాది పాక్ కుట్రపూరిత నైజం మరోసారి బయటపడింది. కశ్మీర్​లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందన్న పాక్ ఆరోపణలను పటాపంచలు చేస్తూ... ఆశ్రయం కోసం భారత్​కు చేరుకున్నారు ఆ దేశ మాజీ ఎమ్మెల్యే. అదే సమయంలో ఆక్రమిత కశ్మీర్​లోని ప్రజలు భారత్​ వైపు మొగ్గు చూపుతూ పాక్​కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని వెల్లడించారు ఆ ప్రాంత జర్నలిస్టు ఆరిఫ్ అజారికా.

By

Published : Sep 10, 2019, 5:24 PM IST

Updated : Sep 30, 2019, 3:39 AM IST

భారత్ ఆశ్రయంలో పాక్ ఎమ్మెల్యే- స్వదేశం వైపే పీఓకే ప్రజల మొగ్గు!

భారత్ ఆశ్రయంలో పాక్ ఎమ్మెల్యే- స్వదేశం వైపే పీఓకే ప్రజల మొగ్గు!

జమ్ముకశ్మీర్‌లో భారత్‌ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ... ఆ దేశంలోని అరాచకాలు సంచలన రీతిలో బయటకువచ్చాయి. పాక్‌లో మైనారిటీ వర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపిస్తూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ నేతృత్వంలోని తెహ్రీక్‌- ఏ-ఇన్సాఫ్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే... భారత్‌లో ఆశ్రయం కోరారు.

నిత్యం తమ కుటుంబాన్ని దుండగులు వేధిస్తున్నారని... కుటుంబ భద్రత పరిగణనలోకి తీసుకొని భారత్‌కు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంతో పాక్‌లో ఏ తరహా శక్తులు రాజ్యమేలుతున్నాయో మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు బట్టబయలైంది.

'ఆక్రమిత కశ్మీర్​లో పాక్ వ్యతిరేక ఆందోళనలు'

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో కొద్ది రోజులుగా పాకిస్థాన్​కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని వెల్లడించారు ఆ ప్రాంత జర్నలిస్టు, లండన్​లో నివాసముంటున్న మానవ హక్కుల కార్యకర్త ఆరిఫ్ అజారికా. జేకేఎల్​ఎఫ్​ సహా పలు సంస్థలు చేస్తున్న ర్యాలీలను పాక్ సైన్యం అణచివేస్తోందని... మీడియాపై ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు. తమ కోసం ఏమైనా చేసేందుకు పాక్​ సైన్యం సిద్ధంగా ఉందని భావిస్తున్న ఆక్రమిత కశ్మీర్ ప్రజలపై దాడులకు దిగుతోందని తెలిపారు. భారత్​కు అనుకూలంగా ఉన్న కశ్మీరీలను మైనారిటీలుగా చేసేందుకు పాక్​ పంజాబ్​కు చెందినవారిని పీఓకేలో నివాసం ఉండేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.

"లండన్​లో ఉంటున్న కశ్మీర్ జాతీయవాదనేతను కశ్మీర్​పై అభిప్రాయం కోరాను. ఆయన చెప్పారు... మోదీ మనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. పాక్ ఇన్నేళ్లుగా మన మీద దాడులు చేస్తోందన్నారు.. ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్​లో ఉగ్రవాదులను తయారుచేస్తోంది... సరిహద్దు దాటి, భారత్​పై దాడులు చేయి అని ప్రేరేపిస్తుందన్నారు. మరో స్వతంత్ర భావాలున్న కశ్మీరీ నేతతో మాట్లాడాను. పాకిస్థాన్​ కావాలా, భారత్​ కావాలా అని ఐరాస మిమ్మల్ని అడిగితే ఏమని సమాధానమిస్తారు అని ప్రశ్నించాను. ఆయన స్థిరంగా చెప్పారు... నేను భారత్​వైపేనని. పాక్ ఆక్రమిత కశ్మీర్​కు భారత్​ను మించిన మంచి ప్రత్యామ్నాయం లేదు."

_ఆరిఫ్ అజారికా, పాక్ ఆక్రమిత కశ్మీర్​లో జర్నలిస్టు

ఇదీ చూడండి: పాక్​-చైనా సంయుక్త ప్రకటనలో కశ్మీర్​ ప్రస్తావనేంటి?​

Last Updated : Sep 30, 2019, 3:39 AM IST

ABOUT THE AUTHOR

...view details