తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​లో 50వేలు దాటిన కరోనా కేసులు

పాకిస్థాన్​లో కొవిడ్​-19 కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య తాజాగా 50వేలు దాటినట్లు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 50 మంది వైరస్​తో మృతి చెందారని తెలిపింది.

By

Published : May 22, 2020, 2:23 PM IST

Pakistan's COVID-19 cases go past 50,000 with record 2,603 new patients
పాక్​లో 50వేలు దాటిన కరోనా కేసులు

పాక్​లో ఒక్కరోజులోనే 2,603 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 50వేలు దాటిందని అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారి వల్ల మరో 50 మంది మరణించగా, కరోనా మృతుల సంఖ్య 1,067కు చేరింది. ఆయా రాష్ట్రాల్లోని లెక్కలను విడుదల చేసింది అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ.

ఏ రాష్ట్రంలో ఎన్ని?

రాష్ట్రం కేసులు
సింధ్​ 19,924
పంజాబ్​ 18,455
కైబర్-పఖ్తున్​క్వా 7,155
బలుచిస్థాన్​ 3,074
ఇస్లామాబాద్​ 1,326
పాక్​ ఆక్రమిత కశ్మీర్​ 158

ప్రాణాంతక కరోనా నుంచి 15,201మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక విమానం ద్వారా దుబాయ్​ నుంచి పాకిస్థాన్​​ వచ్చిన 251 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో ఇప్పటివరకు 4,45,987 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:భారత్‌పై చైనా కుట్రలను పసిగట్టిన అమెరికా!

ABOUT THE AUTHOR

...view details