తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​పై పాక్​కు జోక్యం చేసుకునే అధికారం లేదు'

కశ్మీర్​ అంశంలో పాకిస్థాన్​కు జోక్యం చేసుకునే అధికారం లేదని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ ఉద్ఘాటించారు. పాక్​కు అంతర్జాతీయంగా ఏ ఒక్క దేశమూ మద్దతుగా నిలవడం లేదని స్పష్టం చేశారు.

By

Published : Aug 29, 2019, 12:36 PM IST

Updated : Sep 28, 2019, 5:28 PM IST

'కశ్మీర్​పై పాక్​కు జోక్యం చేసుకునే అధికారం లేదు'

కశ్మీర్​పై పాక్​కు జోక్యం చేసుకునే అధికారం లేదు: రాజ్​నాథ్​

ఉగ్రవాదులను ఉసిగొల్పి భారత్​లో అస్థిరత్వం నెలకొల్పాలని చూస్తున్న పాకిస్థాన్​తో చర్చలు ఏలా సాధ్యమవుతాయన్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా లేవనెత్తాలని చూస్తున్న పాక్​కు ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం లేదని స్పష్టం చేశారు. లేహ్​లో డీఆర్​డీవో కార్యక్రమానికి హాజరైన రాజ్​నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్​లో అంతర్భాగమే. జమ్ముకశ్మీర్​, లద్దాఖ్ ప్రజలు మనకు అండగా ఉన్నారు. మన పొరుగు దేశానికి ఏమైందో అర్థంకావడం లేదు. ముందు మీరు(పాక్​) ఉగ్రవాదాన్ని ఆపండి. పొరుగుదేశంతో సత్సంబంధాలు కొనసాగించాలని మాకు ఉంది. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెబుతూనే.. తీవ్రవాదులను ఉసిగొల్పుతున్నారు. వారికి అండగా ఉంటున్నారు, సమర్థిస్తున్నారు. భారత్​లో అస్థిరత్వం నెలకొల్పాలని చూస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే చర్చలు ఎలా సాధ్యం?"
-రాజ్​నాథ్​ సింగ్, రక్షణ మంత్రి

కశ్మీర్​ అంశంలో పాక్​కు అంతర్జాతీయంగా ఏ దేశమూ మద్దతుగా నిలవడం లేదన్నారు రాజ్​నాథ్.

కశ్మీర్ ఏనాడు పాక్​లో భాగంగా లేదని.. పాక్ ఆక్రమిత కశ్మీర్​లో మానవ హక్కుల ఉల్లంఘనలు, దురాగతాలపై పాక్​ దృష్టి సారించాలని హితవు పలికారు రాజ్​నాథ్.

కశ్మీర్ భారత్​ అంతర్గత విషయమని అమెరికా రక్షణ కార్యదర్శి మార్క్​ ఎస్పర్​ తనతో ఫోన్​లో సంభాషించినప్పుడు స్పష్టం చేశారని రాజ్​నాథ్​ చెప్పారు.

ఇదీ చూడండి: కశ్మీర్​ నుంచి భారత్​ వెనక్కుతగ్గాలని హెచ్చరిక!

Last Updated : Sep 28, 2019, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details