తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ విషయంలో పాక్​ విఫలమవుతూనే ఉంది' - కాల్పుల విరమణ ఒప్పందాన్ని  ఉల్లంఘిస్తున్నట్లు

నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్​ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఆర్మీ ఛీఫ్​ జనరల్​ మనోజ్​ ముకుంద్​ నరవాణే తెలిపారు. ఉగ్రవాదులు సరిహద్దు గుండా భారత్​లోకి చొరబడేలా చేసేందుకు పాక్ శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉందని పేర్కొన్నారు.

pakistan-desperate-to-push-terrorists-as-army-foiled-most-of-infiltration-attempts-army-chief
నియంత్రణ రేఖ వద్ద పాక్ ప్రయత్నాలు విఫలం: నరవాణే

By

Published : Feb 6, 2020, 8:54 PM IST

Updated : Feb 29, 2020, 10:57 AM IST

భారత్​లో సరిహద్దు ద్వారా ఉగ్రవాదులను ఉసిగొల్పేందుకు పాకిస్థాన్​ శతవిధాలా ప్రయత్నిస్తున్నందునే నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన ఘటనలు అధికమైనట్లు సైన్యాధిపతి జనరల్​ మనోజ్​ ముకుంద్​ నరవాణే తెలిపారు.

"నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. ఉగ్రవాద శిబిరాల నుంచి ముష్కరులను భారత్​కు పంపాలని పాక్​ ప్రయత్నిస్తూనే ఉంది. శీతాకాలం కారణంగా ఇది క్లిష్టతరమని భావించి కాల్పులకు తెగడుతోంది. చోరబాటుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎక్కువ సార్లు విఫలమవుతూనే ఉంది. నిరాశకు గురవుతూనే ఉంది."
-మనోజ్​ ముకుంద్ నరవాణే​,ఆర్మీ ఛీఫ్​జనరల్​

కశ్మీర్​ లోయలో గ్రనేడ్​లు విసరడం​, ఐఈడీ బాంబు దాడులకు పాల్పడటం వంటి ఉగ్రవాద ఘటనలు గత ఆరు నెలల్లో చాలా తగ్గాయని నరవాణే తెలిపారు. బలగాలకు అత్యాధునిక ఆయుధాలను సమకూరుస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:మద్యం ఊరికే రాదు... మరి ఇలా కుళాయిల్లో వస్తే.!

Last Updated : Feb 29, 2020, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details