తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారతీయ జవానును బలిగొన్న పాక్​ సైన్యం

పాకిస్థాన్​ మరోసారి కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలు లక్ష్యంగా మోర్టార్ షెల్స్​ ప్రయోగించింది. ఈ ఘటనలో ఒక భారతీయ జవాను అమరుడయ్యాడు.

By

Published : Aug 17, 2019, 1:35 PM IST

Updated : Sep 27, 2019, 7:03 AM IST

భారతీయ జవానును బలిగొన్న పాక్​ సైన్యం

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో రగిలిపోతున్న పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. రాజౌరి జిల్లాలో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. సరిహద్దు వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకుని మోర్టార్ షెల్స్​ ప్రయోగించింది.
నౌషేరా సెక్టార్‌లో పాకిస్థాన్‌ కాల్పులకు తెగబడిన ఘటనలో ఒక భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. పాక్ దాడుల్ని భారత్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్లు రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు.

Last Updated : Sep 27, 2019, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details