తెలంగాణ

telangana

ETV Bharat / bharat

2 నెలలుగా ఉత్తరాలు బంద్​- పాక్​పై భారత్​ ఆగ్రహం - భారత్​-పాక్​ తాజా వార్తలు

గత రెండు నెలలుగా పాకిస్థాన్‌ ఏకపక్షంగా భారత్‌కు తపాలా సేవలను నిలిపివేసిందని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు, సమాచారం అందించకుండానే తపాలా సేవలు నిలిపివేయడం.. అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

2 నెలలుగా ఉత్తరాలు బంద్​- పాక్​పై భారత్​ ఆగ్రహం

By

Published : Oct 21, 2019, 7:07 PM IST

కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు అనంతరం... భారత్​పై పాక్​ కుట్రలు పన్నుతూనే ఉంది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్​ను దోషిగా నిలబెడదామని విఫలయత్నాలు చేసింది. వీటితో ఫలితం లేకపోవడం వల్ల ఆగస్టు 27 నుంచి... దాదాపు 2 నెలలుగా భారత్​కు తపాలా సేవలను నిలిపివేసింది దాయాది దేశం. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. ఇలా వ్యవహరించడంపై భారత్​ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పాక్​ నిర్ణయం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​.

"అన్ని దేశాల తపాలా శాఖలు.... ప్రపంచ తపాలా సమాఖ్య విధానం కింద పనిచేస్తాయి. పాక్‌ చర్య దీనికి వ్యతిరేకంగా ఉంది. పాక్‌ నిర్ణయానికి తగ్గట్లుగానే భారత తపాలా శాఖ ప్రతిస్పందన ఉంటుంది." - రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details