తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాక్​ విచ్ఛిన్నం తప్పదు'

సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ నియంత్రించకుంటే ఆ దేశం ముక్కలు కాకుండా ఎవరూ నిలువరించలేని పరిస్థితి వస్తుందని  రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. గుజరాత్​లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు రక్షణ మంత్రి.

By

Published : Sep 15, 2019, 5:11 AM IST

Updated : Sep 30, 2019, 3:53 PM IST

'ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాక్​ ముక్కలవుతుంది'

'ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాక్​ విచ్ఛిన్నం తప్పదు'

దేశం కోసం ప్రాణాలర్పించిన 122 మంది అమరవీరుల కుటుంబాలతో గుజరాత్‌లోని సూరత్‌లో సమావేశమయ్యారు రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ చరమగీతం పాడకపోతే ఆ దేశం ముక్కలయ్యే పరిస్థితి వస్తుందన్నారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో 2 రోజుల క్రితం పర్యటించిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు రాజ్‌నాథ్‌. ఇమ్రాన్‌ చెప్పినట్లు పాక్ నుంచి ఎవరూ నియంత్రణ రేఖ దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. సరిహద్దులు దాటిన వారిని భారత సైన్యం తిరిగి వెనక్కి పంపబోదని స్పష్టం చేశారు.

"పాకిస్థాన్ మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడుతోంది. ఆ దేశంలో అల్పసంఖ్యాక ప్రజలకు రక్షణ లేదు. దేశ విభజన జరిగి పాకిస్థాన్ ఏర్పడిన తర్వాత ఆ దేశంలో అల్పసంఖ్యాకుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రపంచంలోనే అల్పసంఖ్యాకులకు అత్యంత సురక్షిత దేశం భారత్​. దేశ విభజన సమయంలో ఉన్న మైనార్టీల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడైనా జరుగుతుందంటే అది పాకిస్థాన్​లోనే. దాయాది దేశంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆ దేశం ముక్కలుముక్కలు అవుతుంది."

-రాజ్​నాథ్​ సింగ్, రక్షణ మంత్రి.

ఆర్టికల్ 370 రద్దుపై పాక్... అంతర్జాతీయ వేదికలపై నానాయాగీ చేయాలని చూసినా ఏ దేశమూ దాయాదికి అండగా నిలవలేదన్నారు రాజ్​నాథ్​. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి భారత్‌లో మైనారిటీల సంఖ్యతో పాటు వారి భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు కేంద్ర మంత్రి. పాక్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. ఇది ఇలాగే కొనసాగితే పాక్‌ను ఎవరూ ముక్కలు చేయాల్సిన అవసరం లేకుండానే.. ఆ దేశమే విచ్ఛిన్నమవుతుందని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: పుట్టినరోజున స్వరాష్ట్రంలో మోదీ పర్యటన

Last Updated : Sep 30, 2019, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details