తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2020, 3:39 PM IST

ETV Bharat / bharat

మరోసారి పాక్​ వక్రబుద్ధి.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు

సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లఘించి పాక్​ వక్రబుద్ధి చాటింది. దాయాది జవాన్ల కాల్పులకు దీటుగా బదులిచ్చాయి భారత దళాలు.

Pak shells forward posts along LoC
పాక్​ వక్రబుద్ధి.. నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పులు

సరిహద్దు ప్రాంతంలో కాల్పుల విరమణను మరోసారి ఉల్లఘించింది పాకిస్థాన్​. జమ్ముకశ్మీర్​లోని పూంచ్​, కతువా జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్​ సేనలు కాల్పులకు తెగబడ్డాయి. అయితే భారత సైనిక బలగాలు దీటుగా తిప్పికొట్టాయని అధికారులు తెలిపారు.

శనివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మరణించగా.. మళ్లీ ఈ రోజు ఉదయం పూంచ్​ జిల్లా మెంధార్​లోని నియంత్రణ రేఖ​ వద్ద పాక్​ దళాలు కాల్పులు మొదలు పెట్టాయి. పాక్​ రేంజర్స్ రాత్రిపూట హిరానగర్​ సెక్టార్లోని వివిధ గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతున్నారని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రేపు ఉదయం జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

ABOUT THE AUTHOR

...view details