తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్తార్​పుర్​పై రెండోసారి భేటీకి పాక్​ ప్రతిపాదన

కర్తార్​పుర్​ నడవా ముసాయిదా ఒప్పందంపై మరో సారి భేటీ కావాలని పాకిస్థాన్​ ప్రతిపాదించింది. నడవా తుదిరూపుపై స్పష్టత, సాంకేతిక సమస్యలపై చర్చించేందుకు జులై 14న వాఘా సరిహద్దులో సమావేశం కావాలని భారత్​ను కోరింది.

By

Published : Jul 2, 2019, 9:22 PM IST

Updated : Jul 2, 2019, 10:45 PM IST

కర్తార్​పుర్

కర్తార్​పుర్​పై రెండోసారి భేటీకి పాక్​ ప్రతిపాదన

కర్తార్​పుర్​ నడవా నిర్మాణం, ఇతర సాంకేతిక సమస్యలపై చర్చించేందుకు రెండో సారి భేటీ కావాలని పాకిస్థాన్​ ప్రతిపాదించింది. ఈ మేరకు వాఘా సరిహద్దులో సమావేశం కోసం భారత్​ను పాక్​ కోరిందని విదేశాంగ శాఖ తెలిపింది.

"కర్తార్​పుర్​ ముసాయిదాపై చర్చించి నడవా తుదిరూపుపై నిర్ణయం తీసుకునేందుకు రెండో సారి భేటీ కావాలని పాక్​ ప్రతిపాదించింది. సాంకేతిక సమస్యలు, సౌకర్యాలు తదితర అంశాలపై చర్చకు 2019 జులై 14న వాఘా వద్ద సమావేశం కావాలని కోరింది. ఇందుకోసం భారత్​ తరఫున ప్రతినిధుల బృందంపై స్పష్టత ఇవ్వాలని పాక్​ సూచించింది."

-భారత విదేశాంగ శాఖ

2018 నవంబర్​లో కర్తార్​పుర్​ గురుద్వారా దర్బార్​ సాహిబ్​ నుంచి భారత్​లోని గురుదాస్​పుర్​ డేరా బాబా నానక్​కు అనుసంధానం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అదే ఏడాది నవంబర్​ 26న గురుదాస్​పుర్​లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ శంకుస్థాపన చేశారు. రెండ్రోజుల తర్వాత కర్తార్​పుర్​లోని నరోవాల్​లో పాక్​ పధాని ఇమ్రాన్​ ఖాన్​ పునాది రాయి వేశారు.

ఇదీ చూడండి: 'కర్తార్​పుర్​​ కారిడార్​పై పాకిస్థాన్​ కొర్రీలు'

Last Updated : Jul 2, 2019, 10:45 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details