రాజస్థాన్లోని శ్రీగంగానగర్లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలోకి శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఓ పాకిస్థాన్ డ్రోన్ ప్రవేశించింది. దాదాపు 15 నిమిషాల పాటు చక్కర్లు కొడుతూ భారత గగనతలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు భద్రతా సిబ్బంది పేర్కొంది. వెంటనే అప్రమత్తమైన సైన్యం పాక్ డ్రోన్ను పేల్చేసింది.
మరో పాక్ డ్రోన్ కూల్చివేత - రాజస్థాన్
దేశ సరిహద్దుల వెంబడి పాక్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. శనివారం రాజస్థాన్లోని శ్రీగంగానగర్ సరిహద్దుల్లో భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన పాక్ డ్రోన్ను భారత సైన్యం నేలకూల్చింది.
![మరో పాక్ డ్రోన్ కూల్చివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2707922-536-57ba04c3-6e8e-4706-bbb4-29898b6c7b27.jpg)
దాయాది దేశం పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దేశ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. అంతేకాకుండా ఆ దేశ నిఘా డ్రోన్లను భారత గగనతలంలోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది. భారత సైన్యం అప్రమత్తత కారణంగా పాక్ పన్నాగాలేవి ఫలించడం లేదు.
ఇప్పటికే దేశ సరిహద్దుల్లో మార్చి 4 నుంచి మార్చి 10 లోపు ఆరు పాక్ డ్రోన్లను భారత సైన్యం నేలకూల్చింది. అందులో మార్చి 10న ఒక్కరోజే మూడు పాకిస్థానీ డ్రోన్లు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాయి. భారత సైన్యం వాటికి దీటుగా సమాధానమిచ్చింది.