తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో పాక్​ డ్రోన్​ కూల్చివేత - రాజస్థాన్​

దేశ సరిహద్దుల వెంబడి పాక్​ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. శనివారం రాజస్థాన్​లోని శ్రీగంగానగర్​ సరిహద్దుల్లో భారత్​లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన పాక్​ డ్రోన్​ను భారత సైన్యం నేలకూల్చింది. ​

పాక్​ డ్రోన్

By

Published : Mar 16, 2019, 3:38 PM IST

రాజస్థాన్​లోని శ్రీగంగానగర్​లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలోకి శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఓ పాకిస్థాన్ డ్రోన్ ప్రవేశించింది. దాదాపు 15 నిమిషాల పాటు చక్కర్లు కొడుతూ భారత గగనతలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు భద్రతా సిబ్బంది పేర్కొంది. వెంటనే అప్రమత్తమైన సైన్యం పాక్​ డ్రోన్​ను పేల్చేసింది.

దాయాది దేశం పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దేశ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. అంతేకాకుండా ఆ దేశ నిఘా డ్రోన్​లను భారత గగనతలంలోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది. భారత సైన్యం అప్రమత్తత కారణంగా పాక్​ పన్నాగాలేవి ఫలించడం లేదు.

ఇప్పటికే దేశ సరిహద్దుల్లో మార్చి 4 నుంచి మార్చి 10 లోపు ఆరు పాక్​ డ్రోన్లను భారత సైన్యం నేలకూల్చింది. అందులో మార్చి 10న ఒక్కరోజే మూడు పాకిస్థానీ డ్రోన్​లు భారత్​లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాయి. భారత సైన్యం వాటికి దీటుగా సమాధానమిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details