తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ నుంచి భారత్​లోకి చొరబడ్డ విమానం

భారత గగనతలంలోకి చొరబడ్డ విమానాన్ని వాయుసేన అడ్డుకుంది. పాకిస్థాన్​లోని కరాచీ నుంచి దిల్లీకి వస్తూ నిర్దేశిత మార్గాన్ని వీడిన జార్జియాకు చెందిన కార్గో విమానాన్ని జైపుర్​ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేలా చేసింది. పైలట్లను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

By

Published : May 10, 2019, 7:07 PM IST

Updated : May 10, 2019, 9:47 PM IST

దారి తప్పిన విమానం- అడ్డుకున్న వాయుసేన

పాకిస్థాన్​ నుంచి వస్తూ భారత గగనతలంలోకి చొరబడ్డ జార్జియాకు చెందిన కార్గో విమానాన్ని భారత వాయుసేన అడ్డుకుంది. బలవంతంగా జైపుర్​ విమానశ్రయంలో ల్యాండ్​ అయ్యేలా చేసింది. పైలట్లను భద్రతా అధికారులు ప్రశ్నిస్తున్నారు.

జార్జియాకు చెందిన ఆంటొనోవ్​ ఏఎన్​-12 సరుకు రవాణా విమానం కరాచీ నుంచి దిల్లీ వస్తోంది. నిర్దేశిత మార్గాన్ని వీడి ఉత్తర గుజరాత్​లోని ఓ చోట భారత గగనతలంలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని భారత వాయుసేన గుర్తించింది. వెంటనే జెట్​ను రంగంలోకి దించి... ఏఎన్​-12ను ప్రతిఘటించింది. బలవంతంగా జైపుర్​ విమానాశ్రయంలో దిగేలా చేసింది.

దారి తప్పిన విమానం- అడ్డుకున్న వాయుసేన

ఇదీ చూడండి: మే 23 తర్వాత ఆపరేషన్​ కమల 3.0!

Last Updated : May 10, 2019, 9:47 PM IST

ABOUT THE AUTHOR

...view details