తెలంగాణ

telangana

అమరజవాన్లకు సంఘీభావంగా భాజపా​ ర్యాలీల వాయిదా

By

Published : Jun 18, 2020, 1:11 PM IST

రాజకీయ కార్యక్రమాలు, వర్చువల్​ ర్యాలీలను రెండు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది భాజపా. గాల్వన్​ ఘటనలో వీర మరణం పొందిన సైనికులకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్​ చేశారు.

P pays homage to soldiers killed in Ladakh, postpones virtual rallies for 2 days
సైనికుల మృతికి సంఘీభావంగా భాజపా​ ర్యాలీల వాయిదా

గాల్వన్ ​లోయలో చైనా దుశ్చర్యకు అమరులైన సైనికులకు సంఘీభావం తెలుపుతూ రాజకీయ కార్యక్రమాలు, వర్చువల్​ ర్యాలీలను 2 రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది భాజపా. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్​ చేశారు.

నడ్డా ట్వీట్​

"గాల్వన్ లోయలో దేశ రక్షణలో భాగంగా వీరమరణం పొందిన సైనికుల త్యాగాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దేశం వారికి రుణపడి ఉంటుంది. నేను అమరవీరులకు నివాళులర్పిస్తున్నాను. వీరికి సంఘీభావంగా వర్చువల్ ర్యాలీలతో సహా రాజకీయ కార్యక్రమాలన్నింటినీ 2 రోజుల పాటు వాయిదా వేయాలని భాజపా నిర్ణయించింది."

-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

లద్దాక్​​ గాల్వన్​లోయలో భారత్​- చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు దేశాల సైనికులు మరణించారు. భారత్​కు చెందిన 20 మంది అమరులయ్యారు. 45 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:త్యాగాల వెనుక కదిలించే గాథలు

ABOUT THE AUTHOR

...view details