తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మసూద్​ విషయంలో భాజపా చేసిందేమీ లేదు'

మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించడం భాజపా ఘనతేనని ఆ పార్టీ ప్రకటించుకోవడంపై కాంగ్రెస్ సీనియర్​ నేత చిదంబరం మండిపడ్డారు. హఫీజ్ సయీద్​, లఖ్వీలను కాంగ్రెస్​ హయాంలోనే అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ఐరాస గుర్తించిందని అన్నారు. మసూద్ విషయంలోనూ 1999 నుంచి కాంగ్రెస్​ పోరాడి, నేటికి విజయం సాధించిందని ఆయన చెప్పారు.

By

Published : May 4, 2019, 8:37 PM IST

' మసూద్​ విషయంలో భాజపా చేసిందేమీ లేదు'

' మసూద్​ విషయంలో భాజపా చేసిందేమీ లేదు'

భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్​ నేత పి.చిదంబరం విరుచుకుపడ్డారు. కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించడం తమ ఘనతే అని భాజపా నేతలు ప్రకటించుకోవడంపై మండిపడ్డారు.

మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని 1999 నుంచి కాంగ్రెస్ పోరాడుతోందని, ఇప్పుడు ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయని చిదంబరం పేర్కొన్నారు. ఇందులో భాజపా, ప్రధాని మోదీ ఘనతేమీ లేదని ఎద్దేవా చేశారు.

"హఫీజ్​ సయీద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేలా ఎవరు చేశారు. మీరు హఫీజ్ సయీద్​ పేరును మరిచిపోయారా? లఖ్వీనీ మరిచిపోయారా? ఈ ఇద్దరినీ అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించేలా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మసూద్ అజార్ విషయానికి వద్దాం. 1999లో మసూద్​ ఎక్కడ ఉన్నాడు. అతను భారత కారాగారంలో ఉన్నాడు. అతడిని ఎవరు విడిచిపెట్టారు. నరేంద్రమోదీ పాత జ్ఞాపకాలు చక్కగా మరిచిపోతారు. ప్రత్యేక అతిథిలా మసూద్​ను విమానంలో తీసుకువెళ్లి కాందహార్​లో అప్పగించింది ఎవరు? మసూద్​ను అప్పగించింది. భాజపా ప్రభుత్వం.​" -చిదంబరం, కాంగ్రెస్ సీనియర్​ నేత

ఇదీ చూడండి: కేజ్రివాల్​పై యువకుడి దాడి..

ABOUT THE AUTHOR

...view details