తెలంగాణ

telangana

By

Published : Oct 11, 2020, 5:50 PM IST

Updated : Oct 11, 2020, 7:07 PM IST

ETV Bharat / bharat

రూ.17లక్షల రికార్డు ధరకు అమ్ముడైన జత ఎడ్లు!

కర్ణాటకలో ఓ జత ఎడ్ల ధర అనూహ్యంగా రూ. 17లక్షలు పలికింది. రెండేళ్ల క్రితం వాటిని రూ. 8 లక్షలకు కొన్న ఓ రైతు.. అతనికే రికార్డు ధరకు విక్రయించాడు.

Oxes sold for Rs 17 lakhs in Bagalkote, Karnataka
రూ.17లక్షల రికార్డు ధరకు అమ్ముడైన జత ఎడ్లు!

కర్ణాటకలోని బాగల్​కోట్​లో జత ఎడ్లను రూ. 17 లక్షలకు అమ్మాడు ఓ రైతు. మహాలింగపుర్​లోని నందగావ్​లో సంగప్ప అనే వ్యవసాయదారు, అక్కిమారడికి చెందిన మల్లప్ప దగ్గరి నుంచి 2018లో ఆ ఎడ్లను కొన్నాడు. అప్పుడు వాటి విలువ రూ.8 లక్షలు. ఆ తర్వాత వాటికి రామ్​-లక్ష్మణ్​ అనే పేరు పెట్టి.. ఎంతో అపురూపంగా చూసుకున్నాడు సంగప్ప.

రూ.17లక్షల రికార్డు ధరకు అమ్ముడైన జత ఎడ్లు!

48 పోటీల్లో పాల్గొన్న ఈ ఎడ్లు ఇప్పటివరకు సుమారు రూ. 9 లక్షలు సంపాదించి పెట్టాయట. దాదాపు అన్ని రేసుల్లోనూ తొలి రెండు స్థానాల్లోనే నిలిచేవి.

ఏమైందో తెలియదు కానీ.. ఇప్పుడు మళ్లీ మల్లప్పకే వాటిని రూ.17 లక్షలకు విక్రయించాడు సంగప్ప.

రూ.17లక్షల రికార్డు ధరకు అమ్ముడైన జత ఎడ్లు!
రూ.17లక్షల రికార్డు ధరకు అమ్ముడైన జత ఎడ్లు!

ఇదీ చదవండి:స్కూళ్లు తెరవడంపై ఏ రాష్ట్రం ఏమంటోంది?

Last Updated : Oct 11, 2020, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details