అయోధ్యలో ఆగస్టు 5న రామ మందిర నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య పరిసర ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్రలు జరుగుతున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికతో ఉత్తర్ప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఆగస్టు 5నే జమ్ముకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన రోజు కావున.. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా భద్రత చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం వరకు బలగాల కొనసాగింపు ఉంటుందని తెలిపారు.
రంగంలోకి 3500 మంది
అయోధ్యలో భూమిపూజ నేపథ్యంలో రంగంలోకి 3,500 మందికిపైగా భద్రత సిబ్బందిని మోహరించనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 500 డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. నిఘాను మరింత పటిష్ఠం చేసేందుకు ఇప్పటికే 5,000 సీసీటీవీ కెమెరాలను బిగించామన్నారు.
ముమ్మర తనిఖీ..